న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశీయ ఎఫ్ఎంసీజీ రంగ సంస్థ డాబర్ ఇం డియా.. బాద్ షా మసాలాలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది. 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి రూ.587.52 కోట్ల నిధులు వెచ్చించింది. దేశంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న స్పైసీ విభాగంలో మరింత పట్టు సాధించాలనే ఉద్దేశంతో ఈ కొనుగోలు జరిపినట్లు డాబర్ తెలిపింది.
బాద్షా విలువ రూ.1,152 కోట్లు. మరోవైపు జూలై-సెప్టెంబర్లో కంపెనీ నికర లాభం 2.85 శాతం తగ్గి రూ.490.86 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇది రూ.505.31 కోట్లుగా ఉన్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఆరు శాతం ఎగబాకి రూ.2,986.49 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.