బెంగళూరు, డిసెంబర్ 2: ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ బౌన్స్..సరికొత్త ఈ-స్కూటర్ను మార్కెట్లోకి పరిచయం చేసింది. ‘ఇన్ఫినిటీ ఈ1’ పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.45 వేలుగా నిర్ణయించింది. భారీగా వృద్ధిని నమోదు చేసుకుంటున్న దేశీయ ఈవీ మార్కెట్లో మరింత పోటీని తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో సంస్థ ఈ సరికొత్త స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాటరీ, చార్జర్ ఆప్షన్ కలిగిన మోడల్ ధర రూ.69 వేలుగా నిర్ణయించింది. ఈ స్కూటర్ కావాలనుకునేవారు రూ.499 చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. 48 వీ 39 ఏహెచ్, పోర్టబుల్ బ్యాటరీని 4-5 గంటల పాటు రీచార్జి చేస్తే 85 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చును. ఈ వాహనంపై మూడేండ్ల లేదా 50 వేల కిలోమీటర్ల వరకు వ్యారెంటీ సదుపాయం కల్పించింది. బీవండిలో ఏర్పాటు చేసిన ప్లాంట్లో ప్రతియేటా 1.80 లక్షల వాహనాలు ఉత్పత్తి అవుతున్నాయి.