హైదరాబాద్, మే 12: సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ కంపెనీ బియాండ్కీ హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అమెరికాలోని చికాగో, ఇండియానాపోలిస్లతోపాటు భారత్లోని ఇండోర్, పుణెల్లో ఇప్పటికే ఈ సంస్థకు ఆఫీసులున్నాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలోకి ప్రవేశించి దేశీయ కార్యకలాపాల్ని మరింత విస్తరించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు ఐటీ సేవలు, పరిష్కారాలను అందించేందుకు ఇంకొంత మంది నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్టు ఈ సందర్భంగా బియాండ్కీ వ్యవస్థాపక సీఈవో పియూష్ గోయల్ తెలిపారు. హైదరాబాద్ అంటేనే అవకాశాల గని అన్నారు. ఇక్కడి ప్రతిభావంతులతో పనిచేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. అలాగే సంస్థను ఇంకా విస్తరించే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు. ముఖ్యంగా ఓ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేసే వీలుందన్నారు. ఇందులో మైక్రోసాఫ్ట్ 365, మోడ్రన్ డాటా వేర్హౌజింగ్, బిజినెస్ ఇంటిలిజెన్స్, ఏఐ, ఎన్ఎల్పీ, డైనమిక్స్ 365 వెర్షన్లతో సేవలు అందిస్తామని వివరించారు.