ప్రకాశం జిల్లా: ఒంగోలు గాంధీరోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో ఎంఎస్ఎంఈ శాఖ ప్రారంభమైంది. ఈ శాఖ కార్యకలాపాలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) నిధు సక్సేనా వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యూబీఐ ఒంగోలు రీజియన్ డిప్యూటి రీజినల్ హెడ్ కట్టా హరిబాబు పాల్గొనగా, ప్రాంతీయ కార్యాలయ సారల్ ఏజీఎం ఎం శివకోటయ్య, బ్రాంచ్ చీఫ్ మేనేజర్ బిభూప్రసాద్ సాహు, రీజనల్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్లు, వినియోగదారులు పాల్గొన్నారు.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా వ్యవస్థాపకతను అభివృద్ధి చేయడానికి తమ బ్యాంకు దేశంలో మొత్తం 20 ఎంఎస్ఎంఈ శాఖలను ప్రారంభించినట్లు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్యాంక్ అధికారులు వెల్లడించారు. పట్టణంలోని అన్ని శాఖల్లోని ఖాతాదారుల రుణ విజ్ఞప్తులను ఎంఎస్ఎంఈ శాఖ ద్వారా త్వరితగతిన మంజూరు చేస్తామని చెప్పారు. ఆసక్తిగల పారిశ్రామికవేత్తలు ఎంఎస్ఎంఈ శాఖ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని వారు సూచించారు.