అమరావతి : ఏపీలోని మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి పోలింగ్ బూత్లో ఈవీఎం ధ్వంసం ఘటనపై మంత్రి అంబటి రాంబాబు ( Minister Ambati) పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.
పోలింగ్ బూత్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(MLA Ramakrishna reddy) ఈవీఎం మెషిన్లను ధ్వంసం చేస్తున్న వీడియో నిజమా? ఫేకా(Fake). నిజమైతే ఎన్నికల కమిషన్ వాటిని విడుదల చేయకుండా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) కు ఎలా చేరింది. ట్విట్టర్లో ఎందుకు విడుదల చేశారో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. వాటిపై ఈసీ చర్యలు తీసుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతు న్నాయని పేర్కొన్నారు.
వాస్తవంగా నేరం జరిగితే శిక్ష పడాల్సిందేనని, అయితే ఫేక్ వీడియోలు సృష్టించి నేరాన్ని మోపడం తప్పని అన్నారు. సత్తెనపల్లితో పాటు అనేక నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు పోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకుని రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో మిగతా చోట్ల ఈవీఎంల ధ్వంసం, పోలింగ్ల ఆక్రమణకు సంబంధించిన వీడియోల (Videos) ను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు టీడీపీ శ్రేణులతో మిలాఖతయ్యారని విమర్శించారు. పల్నాడు జిల్లాలో ఏ ఎన్నికల్లో చోటు చేసుకోని విధంగా హింసాత్మక ఘటనలు జరిగాయని ఆరోపించారు.