అమరావతి: టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఆమె ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆమె కొద్ది నెలల క్రితమే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లాలో శోభా హైమావతి గతంలో టీడీపీకి కీలక నేతగా వ్యవహరించారు.
తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పనిచేసిన శోభా హైమవతికి.. తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చినా సరైన గుర్తింపు లభించలేదు. దాంతో కొద్ది రోజుల క్రితం ఆమె టీడీపీకి రాజీనామా చేశారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు తనవంతు కృషి చేస్తానని శోభాహైమావతి ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ మహిళలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు.