అమరావతి : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా భరత్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో నిబద్దతతో పనిచేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. అధికార వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
లక్ష మెజారిటీతో గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్న వైసీపీ నాయకులు దమ్ముంటే మంత్రులను, ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో ఇన్చార్జిలుగా పెట్టవద్దని అన్నారు. అధికార పార్టీని ఓడించాలనే కసి ఉన్న పార్టీలు ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని, అందుకే పోటీ చేస్తున్నామన్నారు.
సామాజక న్యాయం పేరుతో వైసీపీ దగా చేస్తోందని ఆరోపించారు.సామాజిక న్యాయం అయితే ఆత్మకూరులో బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.