ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఆఫీసులపై జరుగుతున్న దాడులకు చంద్రబాబే కారణమని వైసీపీ ఆరోపించింది. ఇదంతా ప్రీ ప్లాన్ ప్రకారం చంద్రబాబు కావాలని చేయిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇది బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, ప్రశాంతంగా ఉన్న ఏపీలో అలజడి సృష్టించి రాజకీయ లబ్ది పొందడానికి చంద్రబాబు పన్నిన కుట్ర ఇది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మీడియాతో తెలిపారు. తెలుగు దేశం పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఆ పార్టీ అధికార ప్రతినిధి హోదాలో పట్టాభి అనే వ్యక్తి ఏపీ సీఎం వైఎస్ జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడి, ఆన్పార్లమెంటరీ లాంగ్వెజ్ వాడి ప్రజలను రెచ్చగొట్టారు.
ఇది మొదటి సారి కాదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదే పదే రెచ్చగొట్టే కామెంట్లు టీడీపీ నేతలు చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లోనే జరుగుతోందని వైసీపీ నేతలు వెల్లడించారు. కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడటం, గవర్నర్కు ఫిర్యాదు చేయడం, తనకు ఏమీ తెలియనట్లు మీడియా ముందు నటించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ వైసీపీ నేతలు ఫైర్ ఆయ్యారు.
చంద్రబాబే అగ్గి రాజేసీ తమాషా చూస్తున్నారని, ఏపీలో టీడీపీ ఆఫీసులపై జరుగుతున్న దాడులకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ముఖ్య నేతలు స్ఫష్టం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రజల్లో అపారమైన గౌరవమున్నగొప్ప మనిషిని పట్టాభి అనే ఓ పనికిమాలిన వ్యక్తి నోటికొచ్చినట్లు పదే పదే మాట్లాడితే జనం ఓపిక పట్టగలరా? ప్రశ్నించారు. ఏపీలో జరిగిన హింసకు ప్రధాన కారకుడు చంద్రబాబే అని వైసీపీ స్ఫష్టం చేసింది.