హైదరాబాద్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని శ్రీదత్తా బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్.. రెండు సరికొత్త ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులను ప్రారంభించింది. అవి ఇంటిగ్రేటెడ్ బీఏ-బీఈడీ, ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ-బీఈడీ కోర్సులు. ఈ కొత్త కోర్సులను ప్రారంభించడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులు ప్రారంభించిన మొదటి ఇన్స్టిట్యూట్గా శ్రీదత్తా బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నిలిచింది.
ఏదైనా గ్రూపులో 10+2 పూర్తిచేసిన విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ బీఏ-బీఈడీ కోర్సులో చేరేందుకు అర్హులు. అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు చదివిన అభ్యర్థులు ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ-బీఈడీ చేయవచ్చు. విద్యార్థులకు 10+2లో వచ్చిన మార్కుల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ఎడ్సెట్ కన్వీనర్-2021 ఈ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. ఈ కోర్సుల్లో చేరిన వారికి ట్యూషన్ ఫీజు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో వాపస్ వస్తుంది.
తెలంగాణ ప్రభుత్వంలోని సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుంది. ఈ రెండు ఇంటిగ్రేటెడ్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షలు రాయడానికి అర్హులు. అదేవిధంగా ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు విదేశాల్లో ఉన్నతవిద్యను కూడా అభ్యసించవచ్చు. అంతేగాక, ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులు చేసే అభ్యర్థులకు ఒక విద్యాసంవత్సరం కూడా ఆదా అవుతుంది.
ఎందుకంటే మూడేండ్ల గ్రాడ్యుయేషన్, రెండేండ్ల బీఈడీ కోర్సు పూర్తిచేయడానికి మొత్తం ఐదేండ్లు పడుతుంది. అయితే, ఈ ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల కాలవ్యవధి కేవలం నాలుగేండ్లు మాత్రమే. అంటే ఒక సంవత్సరం ఆదా అవుతుంది. పూర్తి వివరాల కోసం.. Sree Dattha Brindavan Institute of Teacher Education Affiliated to Palamuru University Approved by NCTE, College Code: SDBN, Singaram X Roads, Narayanpet District, Telangana. Telephones: 8686888686 and 9393808085 చిరునామాలో లేదా www.sreedattha.ac.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు.