నారాయణపేట జిల్లా మక్తల్లో స్థానిక వెంకటరమణ థియేటర్ వద్ద బుధవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంతో ఆసక్తిగా తిలకించాలనుకున్న రవితేజ ‘ఇరుముడి’ చిత్రాన్ని ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా నిలిపివేయడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రేక్షకులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ థియేటర్ గేటు ఎదురుగా బైఠాయించి పెద్దఎత్తున ధర్నా చేపట్టారు.
గత రెండు రోజులుగా ఈ సినిమా కోసం జనం భారీగా పోటెత్తుతున్నారు. తమ సొంత పనులను సైతం పక్కన పెట్టి థియేటర్కు చేరుకుంటున్నప్పటికీ, టికెట్లు దొరక్క నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని ప్రేక్షకులు వాపోయారు. కనీసం నేడైనా సినిమా చూసే అవకాశం ఉంటుందని ఆశతో వస్తే, ప్రదర్శన రద్దు చేశారన్న వార్త వారిని నిరుత్సాహానికి గురిచేసింది. అవసరమైతే నేలపై కూర్చుని లేదా నిలబడి అయినా సినిమా చూస్తామని, ఎంతటి రద్దీనైనా భరిస్తామని వారు స్పష్టం చేశారు. ప్రజల ఆందోళనతో అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం మరియు నిర్వాహకులు తక్షణమే స్పందించి, సినిమా ప్రదర్శనను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ అకస్మాత్తు పరిణామంతో స్థానికంగా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
మక్తల్ వెంకటరమణ థియేటర్లో ఇరుముడి సినిమాను తీసేసారని ధర్నా pic.twitter.com/ANSDpyyQQt
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2026