హైదరాబాద్ : తన పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. బుధవవారం శంషాబాద్లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన కుమారుడు గుత్తా అమిత్ కుమార్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ..ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మంచి కార్యక్రమం అన్నారు.
అడవులతోనే మనిషి మనుగడ ఆధారపడి ఉందన్నారు. ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు.