హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా డీ నాగార్జున నియమితులయ్యారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ ఆదేశాల మేరకు విజిలెన్స్ విభాగం రిజిస్ట్రార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున ప్రస్తుతం నాంపల్లి కోర్టు 10వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్నారు. ప్రస్తుత రిజిస్ట్రార్ జనరల్ అనుపమాచక్రవర్తిని కోపరేటివ్ చైర్పర్సన్గా బదిలీ చేశారు. హైకోర్టు ఐటీ రిజిస్ట్రార్ (ఓఎస్డీ) ఎం రాధాకృష్ణ ఎల్బీనగర్ కోర్టు మొదటి అదనపు సీనియర్ సివిల్జడ్జిగా బదిలీ అయ్యారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఓఎస్డీగా మహబూబ్నగర్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఏడో అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న డీ రమాకాంత్ను నియమించారు.