పప్పు, కూర, సాంబార్ ఇలా ఏదైనా సరే అన్నం తిన్నామంటే చివరలో పెరుగు కావాల్సిందే. అప్పుడే భోజనం పరిపూర్ణం అవుతుందని అంటుంటారు. అందుకే చాలామంది తమ భోజనంలో పెరుగును తప్పనిసరిగా వాడుతుంటారు. పెరుగుతో తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుందని పెద్దలు చెబుతుంటారు. మరి నిజంగా ‘జీర్ణక్రియలో పెరుగు నిజంగా సహాయపడుతుందా?
ఆయుర్వేదం ఏమి చెబుతుందంటే..
జీర్ణక్రియ ప్రక్రియ ఎక్కువగా దోష సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. అయితే.. జీర్ణవ్యవస్థ, జీవక్రియను సమతుల్యం చేయడానికి అత్యంత ప్రభావవంతమైన సాధనం ‘పెరుగు’. భోజనంలో పెరుగును తిన్నా లేదా లస్సీ, మజ్జిగ వంటి పానీయాలు తాగిన గ్యాస్, ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి.
మరి వైద్య శాస్త్రం ఏమి చెబుతుంది..
పెరుగులో కనిపించే ప్రో-బయోటిక్ మూలకాల శక్తితో వైద్య శాస్త్రం కూడా అంగీకరించింది. ఇది అన్ని వయసుల వారిలో జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి ఉదర సంబంధిత సమస్యల వరకు మెరుగ్గా పనిచేస్తుంది. పెరుగులో అధికంగా లభించే కాల్షియం ఎముకలను బలోపేతం చేయడానికి, పోషకాలను బాగా గ్రహించడానికి సహాయపడుతుంది. పెరుగు కచ్చితంగా జీర్ణక్రియకు తోడ్పడుతుందని పోషకాహార నిపుణుడు నిహారికా సేథ్ తెలిపారు. పెరుగులో కనిపించే లాక్టోబాసిల్లస్ బల్గారికస్, స్ట్రెప్టోకోకస్ థర్మోఫిలస్ వంటి జీవులను సూచిస్తూ, మానవ పేగుల్లోని మైక్రోఫ్లోరాను మెరుగుపరచుతాయన్నారు. అంతేకాకుండా తాపజనక ప్రేగు వ్యాధి లక్షణాలను తగ్గిస్తుందని పేర్కొన్నారు.
కేవలం జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరానికి ఇంకా చాలా రకాలుగా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.