హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ముదిరాజ్ల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ చైర్మన్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ తెలిపారు.
ఈ నెల 21న జరుగనున్న ముదిరాజ్ మహాసభ వాల్ పోస్టర్ను మంగళవారం మంత్రుల నివాస ప్రాంగణంలో వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల్లో ముదిరాజ్లకు దక్కని గౌరవం తెలంగాణలో ఎనిమిదేండ్లలో దక్కిందన్నారు. 21న ప్రతి గ్రామంలో, పట్టణంలో, జిల్లా, రాష్ట్ర కేంద్రాల్లో ముదిరాజ్ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను, విద్యార్థి జేఏసీ నాయకుడు అల్లుడు జగన్, డీఎల్ పాండు తదితరులు పాల్గొన్నారు.