ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 కోసం కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ఆటగాళ్లు ముంబై చేరుకున్నారు. జట్టు ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లందరూ వారం రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్లో ఉండనున్నారు. ఆ జట్టు మాజీ కెప్టెన్ దినేశ్ కార్తీక్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ త్రిపాఠి, కమ్లేశ్ నాగర్కోటి, సందీప్ వారియర్, వైభవ్ అరోరా తదితరులు ఇప్పటికే ముంబైలో అడుగుపెట్టారు. ఏప్రిల్ 9 నుంచి 14వ సీజన్ ఆరంభంకానుండగా 11వ తేదీన సన్రైజర్స్ హైదరాబాద్తో కేకేఆర్ తన మొదటి మ్యాచ్లో చెన్నై వేదికగా తలపడనుంది.