విద్యానగర్, మే 15: లుక్స్ బ్యూటీ అకాడమీ, వెలుగు ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ మడుపు అరుణ ఆధ్వర్యంలో ఈ నెల 18న కరీంనగర్ ఫంక్షన్ ప్యాలెస్ లో తెలంగాణ ప్యాషన్ షో నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్, రాష్ట్ర ఆగ్రోస్ డీలర్స్ అసోసియేషన్ చైర్మన్ గౌరిశెట్టి మునీందర్ తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్లోని తన ఛాంబర్లో మడుపు అరుణతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఆ తర్వాత అరుణ మాట్లాడారు. రాష్ట్రంలోనే తొలిసారిగా కరీంనగర్లో ఇండియన్ నేషనల్ బ్యూటీ కాస్మోటిక్ ఎక్స్ పో, ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గురువారం ఉదయం 9 నుంచి సా యంత్రం 5 గంటల వరకు నేషనల్ ట్రైనర్ దీపికా సురేష్ వన్డే మేకప్ ట్రైనింగ్ క్లాస్ ఉంటుందని చెప్పారు. నేషనల్ కాస్మోటిక్, కాస్మోటిక్ మిషనరీస్ 30 స్టాల్స్ లైవ్ డెమో ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ ఉంటాయని చెప్పారు.
సాయంత్రం 5 నుంచి 8 దాకా బిగ్ ఫ్యాషన్ షో ఉంటుందని, ఇందులో మిస్ తెలంగాణ, మిస్సెస్ తెలంగాణ, మదర్ బేబీ తెలంగాణ కాంటెస్ట్ ఉంటుందన్నారు. ఇందులో ఫస్ట్ విన్నర్కు రూ.5వేలు, ద్వితీయ రూ.3వేలు, తృతీయకు రూ.వెయ్యి ప్రైజ్ మనీ తో పాటు పాల్గొన్న ప్రతి ఒకరికీ ఐకాన్ అవార్డు ఇస్తామని వివరించారు. ము ఖ్య అతిథిగా మిస్ ఏషియా ఇంటర్నేషనల్ రశ్మి ఠాగూర్, నేషనల్ హ్యాండ్లూమ్ అం బాసిడర్, మంత్రి గంగుల కమలాకర్, మేం సైతం యువసేన ఫౌండేషన్ చకిలం స్వప్న శ్రీనివాస్ పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు 93938 30233, 9010006148, 9985251854కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇండియా నేషనల్ బ్యూటీ కాస్మెటిక్స్ ఎక్స్ పో నిర్వాహకులు వెలుగు ఫౌండేషన్ అధినేత రాంప్రకాష్ నరేష్, సంతోష్ ఉన్నారు.