చండీఘడ్: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) తన ప్రతాపాన్ని చూపాడు. హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటర్ కేవలం 29 బంతుల్లోనే 97 రన్స్ చేసి ప్రత్యర్థిని మట్టికరిపించాడు. ఆ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు 47 రన్స్ తేడాతో నెగ్గింది. అయితే మ్యాచ్ జరగడానికి ముందు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వైభవ్ సూర్యవంశీ తన మనస్తత్వాన్ని చాటుకున్నాడు. సీనియర్ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, సంజయ్ బాంకర్ కాళ్లను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు. బ్రాడ్కాస్టింగ్ ఏరియాలో ఉన్న గవాస్కర్, బంగర్లు మీడియా మాట్లాడుతున్న సమయంలో.. అక్కడే మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న సూర్యవంశీ అకస్మాత్తుగా ఆ ఇద్దరి వద్దకు పరుగెత్తి, వాళ్ల పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక టీవీ ప్రజెంటర్ జతిన్ సప్రూ పాదాలను కూడా వైభవ్ తాకబోయాడు. ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Vaibhav Sooryavashi touched the feet of Sunil Gavaskar and Sanjay Bangar before the match.
– Jatin Sapru quickly moved away when Vaibhav tried to touch his feet too. 🤣❤️ pic.twitter.com/xSmb0nccOU
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 27, 2026