బెంగళూరు: దులీప్ ట్రోఫీ మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. నార్త్ జోన్తో క్వార్టర్ఫైనల్లో వెస్ట్ జోన్ బ్యాటర్లు తేలిపోయారు. అబిద్ ముస్తాక్ (5/39), అర్ష్దీప్ సింగ్ (3/53) మెరవడంతో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని వెస్ట్.. తొలి ఇన్నింగ్స్లో 187 పరుగులకే ఆలౌట్ అయింది. శామ్స్ ములానీ (52) టాప్ స్కోరర్. 64 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్కు వచ్చిన నార్త్జోన్.. రెండో రోజు ఆట చివరికి 107/4తో నిలిచి 171 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఇక నార్త్ఈస్ట్ జోన్తో జరుగుతున్న మరో మ్యాచ్లో ఈస్ట్జోన్ గెలుపు దిశగా సాగుతున్నది. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలోని ఈస్ట్ బౌలర్లు బెంబేలెత్తించడంతో నార్త్ఈస్ట్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 111 పరుగులకే ఆలౌట్ అయి ఫాలో ఆన్ ఆడుతున్నది. అజిజిత్ సర్కార్ (5/20)కు తోడు బ్యాట్తో సెంచరీ చేసిన షాజాబ్ అహ్మద్ (3/20) మూడు వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇషాన్ సేన 467 రన్స్కు ఆలౌట్ అయింది.