హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ స్కేటర్ ప్రణవ్ మాధవ్ ఆసియా ఓపెన్ షార్ట్ ట్రాక్ ఐస్ స్కేటింగ్ చాంపియన్షిప్లో మూడు పతకాలతో మెరిశాడు. డెహ్రాడూన్లో గురువారం ముగిసిన ఈ టోర్నీలో బాలుర 1000 మీటర్ల రేస్లో 1 నిమిషం 33.930 సెకండ్ల టైమింగ్తో రెండో స్థానంతో రజతం గెలిచాడు.
500 మీటర్ల విభాగంలో 44.1 సెకండ్లతో మూడో స్థానంతో కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. ప్రణవ్ ప్రాతినిధ్యం వహించిన భారత పురుషుల జట్టు 5000 మీటర్ల రిలేలో 7 నిమిషాల 20.994 సెకండ్ల టైమింగ్తో కంచు పతకం అందుకుంది.