హైదరాబాద్, ఆట ప్రతినిధి: కేరళలో ఈనెల 26న జాతీయ మహిళల సీనియర్ ఫుట్బాల్ టోర్నీ ప్రారంభమవుతున్నది. ఇందుకోసం గజ్వేల్ బీసీ సంక్షేమ పాఠశాలలో తెలంగాణ సీనియర్ మహిళల జట్టు గత కొన్ని రోజులుగా శిక్షణ పొందింది. బుధవారంతో ముగిసిన ట్రైనింగ్ కార్యక్రమానికి సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాపరెడ్డి, తెలంగాణ ఫుట్బాల్ సంఘం(టీఎఫ్ఏ) కార్యదర్శి ఫాల్గుణ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ టోర్నీలో రాష్ట్ర జట్టు సత్తాచాటాలని సాట్స్ చైర్మన్ ఆకాంక్షించారు.