బెంగళూరు: వెస్ట్జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ పేసర్ విద్వత్ కవేరప్ప 7 వికెట్లతో సత్తాచాటాడు. విద్వత్ (7/53) ధాటికి వెస్ట్జోన్ తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే కుప్పకూలింది. దీంతో సౌత్ జోన్కు 67 పరుగుల ఆధిక్యం దక్కింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ జోన్ వర్షం కారణంగా శుక్రవారం మూడో రోజు ఆట ఆగే సమయానికి 181/7తో నిలిచింది. కెప్టెన్ హనుమ విహారి (42), రికీ భుయ్ (37) రాణించారు. వెస్ట్ జోన్ బౌలర్లలో అర్జాన్, అతిత్, ధర్మేంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు.