IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మరో ఆరు రోజుల్లో షురూ కానుంది. చిదంబరం స్టేడియంలో మార్చి 22న జరిగే ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(CSK), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్లు తలపడనున్నాయి. దిగ్గజ ఆటగాళ్లు ఎంఎస్ ధోనీ(MS Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు తలపడే ఈ మ్యాచ్పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇది ధోనీ ఫేర్వెల్ సీజన్ కావడంతో, చెన్నై, సీఎస్కే మ్యాచ్ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉండనుంది.
ఐపీఎల్ ఆరంభానికి నాలుగు రోజుల ముందే అంటే.. మార్చి 18వ తేదీన టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. టికెట్ల ధరలు రూ. 1,700ల నుంచి రూ.7,500 రేంజ్లో ఉంటాయని సమాచారం. పదహారో సీజన్లో విజేతగా నిలిచిన చెన్నై రికార్డు స్థాయిలో ఐదో టెటిల్ ఖాతాలో వేసుకుంది. అయితే.. కెప్టెన్ ధోనీ 17వ సీజన్తో కెరీర్కు రిటైర్మెంట్ పలికే చాన్స్ ఉంది. దాంతో, ఈ ఏడాది కూడా కప్పుతో మహీ భాయ్కు వీడ్కోలు పలకాలని భావిస్తోంది. మరోవైపు ఆర్సీబీ తొలి టైటిల్ వేటను విజయంతో మొదలెట్టాలనే కసితో ఉంది.