Redmi 12C | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ రెడ్మీ ఈ నెల 30న భారత్ మార్కెట్లోకి రెడ్మీ నోట్12 4జీతోపాటు రెడ్మీ 12 సీ ఫోన్ను ఆవిష్కరించనున్నది. ఇటీవలే నోట్ 12 సిరీస్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. రెడ్ మీ నోట్ 12 5జీ, నోట్ 12 ప్రో 5జీ, నోట్ 12ప్రో+ 5జీతోపాటు రెడ్మీ నోట్ 12 4జీ ఫోన్లు అందులో ఉన్నాయి. ఇంతకుముందు నోట్ 12 4జీ ఫోన్ను ఈ నెల 30న భారత్ మార్కెట్లోకి తెస్తామని ప్రకటించిన రెడ్మీ.. తాజాగా రెడ్మీ 12 సీ ఫోన్ను ఆవిష్కరిస్తామని ప్రకటించింది.
మీడియాటెక్ హెలియో జీ85 చిప్సెట్తో చైనా, ఇండోనేషియా మార్కెట్లలో రెడ్మీ నోట్ 12 సీ ఫోన్ ఆవిష్కరించింది. భారత్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.10 వేల లోపు ఉంటుందని ధృవీకరించింది.
షాడో బ్లాక్, సీ బ్లూ, మింట్ గ్రీన్, లావెండర్ కలర్స్ ఆప్షన్లలో చైనా మార్కెట్లో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ 4జీబీ రామ్ విత్ 64 ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రెడ్ మీ 12సీ.. 699 యునాన్లు (సుమారు రూ.8,400), 4జీబీ రామ్ విత్ 128 ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ వేరియంట్ ఫోన్ 799 యునాన్లు (దాదాపు రూ.9,600), హై ఎండ్ 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ మోడల్ 899 యునాన్లు (సుమారు రూ.10,800) పలుకుతుంది.