సమంత కథానాయికగా గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా శాకుంతలం. డీఆర్పీ- గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై దిల్ రాజు సమర్పణలో వస్తున్న ఈ చిత్ర నిర్మాణం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా.. దిల్ రాజ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.