నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఎయిమ్స్ తర్వాత అంతటి ప్రాచుర్యాన్ని పొందిన ప్రభుత్వ ఆస్పత్రి. ప్రపంచ శ్రేణి వైద్యం, విద్యాబోధన ఇక్కడి విశిష్టత. వైద్య రంగంలో ఎందరో నిష్ణాతులను ఉత్తమైన స్పెషలిస్టులను తీర్చిదిద్దిన ఘనత నిమ్స్కు ఉంది. 2004లో ప్రవేశపెట్టిన మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (ఎంహెచ్ఎం) కోర్సుకు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. ప్రతి ఏడాది ఎందరో విద్యార్థులు ఇక్కడ కోర్సు పూర్తి చేసుకొని మంచి వేతనాలతో కూడిన ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అలాంటి నిమ్స్ ఎంహెచ్ఎం కోర్సులో
ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైన
నిమ్స్ దవాఖానలో 2004లో ఈ కోర్సును ప్రారంభించాం. 20 సీట్లు కలిగిన ఈ కోర్సులో చేరేందుకు 100 మార్కులకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తాం. పూర్తి పారదర్శకంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తాం. 250 మందికి పైగా ఈ కోర్సు పూర్తిచేసి సీఈఓ, జనరల్ మేనేనజర్ల హోదాలో పనిచేస్తున్నారు. శిక్షణ తీసుకుంటున్నవారికి ఆర్నెళ్ల పాటు ఆన్ జాబ్ ట్రెయినింగ్ పీరియడ్ ఉంటుంది. నిమ్స్లోనే వివిధ విభాగాల్లో పనిచేయిస్తూ శిక్షణ ఇస్తాం. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తరగతులు ఉంటాయి.