న్యూఢిల్లీ: భారత్-చైనా దౌత్య సంబంధాల్లో కీలకమైన ముందడు గు పడింది. చైనీయులకు టూరిస్ట్ వీసాలు జారీచేయటాన్ని భారత్ పునరుద్ధరించబోతున్నది.2020లో గల్వాన్ ఘర్షణతో చైనాతో భారత్ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆనాటి నుంచి దాదాపు ఐదేండ్లుగా చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలను భారత్ నిలిపివేసింది. మళ్లీ ఇన్నేండ్లకు ఇరు దేశాల సంబంధాలు సాధారణ స్థితికి రావటంతో టూరిస్ట్ వీసాల జారీపై భారత్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కేంద్ర హోంశాఖ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం.. చైనా, హాంకాంగ్, మకావుకు చెందిన పౌరులకు రెగ్యులర్ వీసాల జారీకి సంబంధించి మార్గదర్శకాలను భారత్ సవరించింది.