శ్రీశైలం : శ్రీశైల క్షేత్ర విశేషాలను భక్తకోటికి అందిస్తున్న శ్రీశైలప్రభ ఆధ్యాత్మిక మాసపత్రిక
సంపాదకుడు డాక్టర్ అనిల్ కుమార్కు పదోన్నతి లభించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే సప్తగిరి ఆధ్యాత్మిక మాస పత్రిక ఎడిటోరియల్ సభ్యుడిగా ఆయనకు అవకాశం దక్కినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.
1991లో శ్రీశైల దేవస్థానం ఈఓ సీసీగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ కొంతకాలానికి డాక్టరేట్ పొంది శ్రీశైలప్రభ ఆధ్యాత్మిక మాసపత్రికకు సంపాదకుడు అయ్యారు.
ఆ తరువాత శ్రీశైల టీవీ ఇన్చార్జీగా, మీడియా కోఆర్డినేటర్గా వ్యవహరిస్తూ స్వామి అమ్మవార్ల నిత్య కైంకర్యాలను ప్రేక్షకులకు చేరవేయడంలో ప్రధానపాత్ర పోషిస్తున్నారు.
శ్రీశైలప్రభ మాసపత్రికను విశ్వవ్యాప్తం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఆయనకు తితిదే అరుదైన గౌరవం ఇవ్వడం పట్ల ఈఓ హర్షం వ్యక్తంచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి