సుల్తాన్ బజార్, నవంబర్ 22: నిత్యం విధి నిర్వహణలో శ్రమించే ఉద్యోగులకు క్రీడలు మానసికోల్లాసాన్ని ఇస్తాయని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు ఎం.రాజేందర్ అన్నారు. ఈ మేరకు సోమవారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా 7వ స్పోర్ట్స్, గేమ్ 2021లో భాగంగా ఈ నెల 25 నుంచి 28 వరకు జింఖానా మైదానంలో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేందర్ విచ్చేసి 23 జట్లకు డ్రాను ప్రధాన కార్యదర్శి ఆర్.ప్రతాప్, హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం హుస్సేనీలతో కలిసి ఆయన తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, క్రీడలు ఒత్తిడిని తగ్గిస్తాయని అన్నారు. కార్యక్రమంలో టీఎనీ ్జవో కేంద్ర సంఘం కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు, నాయకులు ఇటిక్యాల కొండల్ రెడ్డి, టీఎన్జీవో హన్మకొండ అధ్యక్షుడు రాజేందర్, కార్యదర్శి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు వేణుగోపాల్, హైదరాబాద్ జిల్లా శాఖ కార్యదర్శి ఎస్.విక్రమ్ కుమార్, ఉపాధ్యక్షులు కేఆర్ రాజ్ కుమార్, ఉమర్ ఖాన్తో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.