Sonal Chauhan in Adipurush | ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ మాత్రం వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ప్రభాస్ ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం ప్రభాస్ ఆశలన్ని ‘ఆదిపురుష్’ పైనే ఉన్నాయి. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈచిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగాఉంది. అయితే షూటింగ్ గడిచి నెలలు దాటుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క అప్డేట్ను కూడా మేకర్స్ ప్రకటించలేరు. దాంతో అభిమానులు చిత్రబృందంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి వార్త బయటకు వచ్చిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించాడు. కాగా లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నిజ్జర్ నటించాడు. అయితే లక్ష్మణుడి భార్యగా టాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహన్ నటించింది. తాజాగా ఈమె ఆదిపురుష్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీ ఆదిపురుష్కు ముందు, ఆదిపురుష్కు తర్వాత అనే విధంగా ఉంటుందని వెల్లడించింది. ఆదిపురుష్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా రిలీజ్ కాబోతుంది అని తెలిపింది. ఈ వ్యాఖ్యలతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా కృతి సనన్ హీరోయిన్గా నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలకపాత్రలో నటించాడు.ఈ చిత్రాన్ని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు థియేట్రికల్ హక్కులను యూవీ క్రియేషన్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దసరా నుండి సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అక్టోబర్ 3న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కాబోతున్నట్లు టాక్.