BANW vs SAW : మహిళల టీ20 ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగారు. సెమీస్ బెర్తును పట్టేయాలనే కసిని ప్రదర్శించి.. బంగ్లాదేశ్ జట్టును స్వల్ప స్కోర్కే కట్టడి చేశారు. 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లా శోభనా మోస్త్రే(42), షర్మీ అక్తర్(22), కెప్టెన్ నిగర్ సుల్తానా(32) రాణించడంతో వంద పరుగులు చేయగలిగింది. మ్లాబా తిప్పేయడంతో 117 రన్స్కే పరిమితమైంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లాదేశ్ 117 పరుగులే చేసింది. భారీ స్కోర్తో దక్షిణాఫ్రికాకు సవాల్ విసరాలనుకున్న ఆ జట్టును మరిజానే కాప్(1-9) తొలి ఓవర్ మొదటి బంతికే దెబ్బకొట్టింది. ఓపెనర్ ఫిర్దౌస్(0)ను బౌల్డ్ చేసి షాకిచ్చింది షబ్నం ఇస్మాయిల్ ఓవర్లో తేజ్ నెహర్(1) ఎల్బీగా ఔటవ్వగా.. 14 పరుగులకే బంగ్లా రెండు వికెట్లు కోల్పోయింది.
Nigar Sultana Joty’s quickfire 32* off 20 lifts Bangladesh to 117/5 after Sobhana Mostary’s 42 – will this be a comfortable chase for South Africa?
Follow live: https://t.co/W0MZdRiEB7 pic.twitter.com/sPqeR3mEO3
— Cricinfo (@cricinfo) June 28, 2026
కాప్, ఇస్మాయిలు నిప్పులు చెరుగుతుండడంతో ఓపికగా ఆడిన శోభనా మోస్త్రే(42), షర్మీన్ అక్తర్(22)లు ఇన్నింగ్స్ నిర్మించారు. షర్మీన్ను మ్లాబా పెవిలియన్ చేర్చగా.. నిగర్ సుల్తానా(32) పోరాడింది. మోస్త్రే జతగా సఫారీ బౌలర్లను కాచుకున్న సుల్తానా ఆఖరి వరకూ నిలిచినా బంగ్లా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 117 రన్స్ చేసిందంతే.