న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు విలువ 2.23 కోట్లు. ఎక్కువ శాతం బ్యాంక్ డిపాజిట్ల రూపంలో ఆ మొత్తం ఉంది. అయితే ఆయన పేరు మీద ఎటువంటి స్థిరాస్తి లేదు. గాంధీనగరలో ఉన్న స్థలాన్ని ఆయన డొనేట్ చేశారు. బాండ్, షేర్, మ్యుచువల్ ఫండ్స్లో ఆయనకు పెట్టుబడి లేదు. స్వంత వాహనం లేదు. మోదీకి నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వాటి విలువ 1.73 లక్షలు. మార్చి 31వ తేదీన ఇచ్చిన డిక్లరేషన్ ఆధారంగా ఈ వివరాలు తెలిశాయి. ఏడాది కాలంలో మోదీ ఆస్తులు 26.13 లక్షలు పెరిగినట్లు తెలుస్తోంది. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఓ రెసిడెన్షియల్ ప్లాట్ను ముగ్గురితో కలిసి కొన్నారు. అయితే ఆ ఫ్లాట్ను దానం చేసినట్లు తెలుస్తోంది .
రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చరాస్థి 2.54 కోట్లు కాగా, స్థిరాస్థి 2.97 కోట్లు అని డిక్లరేషన్ ద్వారా తేలింది. 29 మంది క్యాబినెట్ మంత్రుల్లో .. ధర్మేంద్ర ప్రధాన్, జ్యోతిరాధిత్య సింథియా, ఆర్కే సింగ్, హర్దీప్ సింగ్ పురి, పురుషోత్తం రూపాలా, జీ కిషన్ రెడ్డిలు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు.