వనపర్తి, మార్చి 21 : రాష్ట్రంలో పే దింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం అండగా ఉందని వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన 421 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశా రు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉన్నందున కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఆలస్యమైందని, లబ్ధిదారులు సహకరించినందుకు ప్రత్యేక ధనవాదాలు తెలిపారు.
మీ కుటుంబ సభ్యుల పెండ్లిళ్లకు ఆహ్వానించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల హాజరుకాలేక పోయాయన్నారు. అయినా అందరితో కలిసి భోజ నం చేసి.. పెండ్లికి రాలేని కొరతను తీర్చేందుకే విందు ఏర్పాటు చేశానన్నారు. పేద బలహీన వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. అందరూ బాగుండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. కరోనాతో ప్రపంచం స్తంభించినా తెలంగాణలో సంక్షేమ పథకాలు ఆగలేదని, సీఎం ముందు చూపుతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. సామాన్య ప్రజ లు అవసరాలపై అవగాహన ఉంటేనే ఇ లాంటి పథకాల అమలు సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో 14 ఏండ్లు ప్రజల కష్టాలను దగ్గరుండి చూసినందునే దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రూపుదిద్దుకున్నాయని చెప్పా రు. ప్రజల ఆశీర్వాదమే తెలంగాణ ప్రభుత్వానికి బలం, బలగమని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ విజ య్, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, కృష్ణ య్య, గోపాల్పేట జెడ్పీటీసీ భార్గవి, ఎం పీపీ సంధ్య, నాయకులు వెంకటేశ్, రమే శ్, తిరుమల్, గోపాల్, రహీం, ఆయా మండలాల తాసిల్దార్లు, వీఆర్వోలు, టీఆ ర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు తదితరు లు పాల్గొన్నారు.