హైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆపన్నహస్తం అందించారు. చెవి నొప్పి, వినికిడి లోపంతో ఇబ్బంది పడుతున్న నగరంలోని అంబర్పేట నివాసి కె.సంజీవరావుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంత్రి కొప్పుల రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించారు.
అలాగే జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన గొర్రెల నరేష్ కుమారుడు మోక్షిత్ అనారోగ్యానికి గురయ్యాడు సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన మంత్రి రూ.3 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించారు. మంత్రి హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం సంజీవరావు, మోక్షిత్ తండ్రి నరేష్కు ఇందుకు సంబంధించిన పత్రాలను అందజేశారు.