సిద్దిపేట : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి 9వ ఆదివారం సందర్భంగా రూ. 53,09,685
ఆదాయం వచ్చినట్లు ఆలయ ఏఈవో వైరాగ్యం అంజయ్య తెలిపారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. శనివారం రూ.3,62,991, ఆదివారం రూ. 43,19,808, సోమవారం రూ. 6,26,886 ఆదాయం ఆర్జిత సేవలైన గదుల కిరాయిలు, దర్శనాల టికెట్లు, లడ్డూ, పులిహోర విక్రయం తదితర వాటి ద్వారా మొత్తం రూ. 53,09,685 స్వామి వారి ఖజనాకు సమకూరినట్లు తెలిపారు.
గత యేడాది బ్రహ్మోత్సవాలలో 9వ ఆదివారం రూ. 43,91,194 వచ్చిందన్నారు. అలాగే మహా శివరాత్రి సందర్భంగా ఆదాయం రూ.17,56,476 స్వామి వారి ఖజానాకు చేకూరిందన్నారు.