సింగపూర్: గణిత స్థిరాంకం ‘పై’(22/7)కి సంబంధించిన 1,560 దశాంశ స్థానాలను గుర్తుంచుకొని భారత సంతతికి చెందిన ఆరేండ్ల ఇషానీ షణ్ముగం.. సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నది. సింగపూర్లో ఇప్పటివరకూ ఇదే రికార్డు. కాగా, ‘పై’విలువను 70 వేల దశాంశ స్థానాల వరకు అనర్గళంగా చెప్పిన భారతీయ విద్యార్థి రాజ్వీర్ మీనా (21) పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డు ఉన్నది.