సాంకేతికత, ఆవిష్కరణల రంగంలో భారత్ ప్రభ వెలిగిపోతున్నది. ఇప్పటికే ఐటీలో మేటిగా ఎదిగిన భారతావని.. సుశిక్షిత నిపుణులకు కేంద్రంగా మారుతున్నది. భారతీయుల ప్రతిభను గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు వారిని అందలం ఎక్కిస్తున్నాయి. ఆల్ఫాబెట్-గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబి, ఐబీఎం వంటి ప్రపంచస్థాయి టాప్ కంపెనీల సీఈవోలుగా భారత సంతతి వ్యక్తులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పరాగ్ అగర్వాల్ చేరారు. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సీఈవోగా తాజాగా పరాగ్ నియమితులయ్యారు.
పేరు: పరాగ్ అగర్వాల్
కంపెనీ: ట్విట్టర్
వార్షిక వేతనం (అంచనా):
రూ. 7.5 కోట్లు
విద్యాభ్యాసం: ఐఐటీ-బాంబేలో
కంప్యూటర్ సైన్స్, స్టాన్ఫర్డ్లో పీహెచ్డీ
భారత్తో అనుబంధం: అజ్మీర్
(రాజస్థాన్)లో పుట్టారు. తల్లి రిటైర్డ్ స్కూల్ టీచర్, తండ్రి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో ఉన్నతాధికారి.
పేరు: సత్యనాదెళ్ల
కంపెనీ: మైక్రోసాఫ్ట్
వార్షిక వేతనం
(మూల వేతనం మాత్రమే):
రూ. 18.7 కోట్లు
విద్యాభ్యాసం: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్య, మణిపాల్ ఇన్స్టిట్యూట్ (కర్ణాటక)లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, విస్కాన్సిన్-మిల్వౌకీలో ఎమ్మెస్, షికాగో యూనివర్సిటీలో ఎంబీఏ.
భారత్తో అనుబంధం:
హైదరాబాద్లో పుట్టారు.
తల్లి ప్రభావతి సంస్కృత టీచర్, తండ్రి యుగంధర్ 1962
బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
పేరు: శంతను నారాయణ్
కంపెనీ: అడోబి
వార్షిక వేతనం
(మూల వేతనం మాత్రమే):
రూ. 7.5 కోట్లు
విద్యాభ్యాసం: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్య, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈసీఈలో ఇంజినీరింగ్, బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీలో ఎమ్మెస్, కాలిఫోర్నియా వర్సిటీలో ఎంబీఏ.
భారత్తో అనుబంధం: హైదరాబాద్లో పుట్టారు. తల్లి అమెరికన్ లిటరేచర్లో
నిపుణురాలు, తండ్రి ప్లాస్టిక్ కంపెనీ
నడిపేవారు.
పేరు: సుందర్ పిచాయ్
కంపెనీ: గూగుల్ , ఆల్ఫాబెట్
వార్షిక వేతనం (అంచనా): రూ.15 కోట్లు
విద్యాభ్యాసం: ఐఐటీ-ఖరగ్పూర్లో మెటలార్జికల్ ఇంజినీరింగ్, స్టాన్ఫర్డ్లో ఎమ్మెస్, పెన్సిల్వేనియాలో ఎంబీఏ.
భారత్తో అనుబంధం: మధురైలో పుట్టారు. తల్లి లక్ష్మి స్టెనోగ్రాఫర్, తండ్రి రఘునాథ పిచాయ్ జీఈసీలో ఇంజినీర్.
అధిపతులుగా మరికొందరు మనోళ్లు..
అజయ్బంగా (మాస్టర్కార్డ్), సంజయ్ మోహ్రోత్రా (మైక్రాన్ టెక్నాలజీ), ఇంద్రానూయీ (పెప్సికో మాజీ సీఈవో), నికేశ్ అరోరా (పాలో ఆల్టో నెట్వర్క్స్), రంగరాజన్ రఘురాం (వీఎమ్వేర్), జయశ్రీ ఉల్లాల్ (అరిష్టా నెట్వర్క్స్), జార్జ్ కురియన్ (నెట్యాప్), రేవతి ఐద్దెతి (ఫ్లెక్స్), అంజలి సూద్ (విమియో).
పేరు: అరవింద్ కృష్ణ
కంపెనీ:
ఐబీఎం
వార్షిక వేతనం
(మూల వేతనం మాత్రమే):
రూ. 11.2 కోట్లు
విద్యాభ్యాసం: ఐఐటీ-కాన్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇల్లినాయిస్ వర్సిటీలో పీహెచ్డీ.
భారత్తో అనుబంధం: పశ్చిమ గోదావరిలో పుట్టారు. తల్లి హారతి కృష్ణ.. యుద్ధంలో అమరులైన సైనికుల భార్యలకు సాయం చేసేవారు. తండ్రి మేజర్ జనరల్ వినోద్ కృష్ణ.. సైన్యంలో ఉన్నతాధికారి.
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ట్విట్టర్ సీఈవోగా నియమితులైన భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్కు మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. ‘మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబి, ఐబీఎం, మైక్రాన్, మాస్టర్ కార్డ్ ఇప్పుడు ట్విట్టర్.. ఈ సంస్థల్లో కామన్గా ఉన్నది ఏంటి? వీటన్నింటికీ ఇండియాలో పుట్టిపెరిగిన సీఈవోలే నాయకత్వం వహిస్తున్నారు. ట్విట్టర్ సీఈవోగా ఎంపికైన పరాగ్కు అభినందనలు’ అని ట్వీట్లో పేర్కొన్నారు.