IND VS WI 2nd Test | తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన భారత జట్టు.. రెండో టెస్టులోనూ గట్టి పునాది వేసుకుంటున్నది. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. తన కెరీర్లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీకి (87*) దగ్గరవ్వగా.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) క్రీజ్(36*) లో ఉన్నాడు.
ఇక గత మ్యాచ్లో అరంగేట్ర టెస్టు ఆడుతూ భారీ సెంచరీ బాదిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashaswi jaiswal).. ఈసారి అర్ధశతకం (74 బంతుల్లో 57; 9 ఫోర్లు, ఒక సిక్సర్)తో రాణించాడు. మరో సెంచరీ చేసేలా కనిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) (143 బంతుల్లో 80; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) వారికన్ (Jomel Warrican) ఓవర్లో వికెట్ సమర్పించుకున్నాడు.
మరోవైపు శుభ్మన్ గిల్ (10), అజింక్య రహానె (8) తొలి టెస్టులో మాదిరిగానే తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరి నిరాశ పరిచారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ (Kemar Roach), గాబ్రియల్ (Shannon Gabriel), వారికన్, జేసన్ హోల్డర్ (Jason Holder) తలో వికెట్ తీశారు. ఫామ్ లో ఉన్న కోహ్లీ తన 30వ అర్ధ శతకం పూర్తి చేసుకుని.. సెంచరీకి చేరువయ్యాడు. రెండో రోజు కూడా కోహ్లీ, జడేజాలు ఇదే ఆటతీరును కొనసాగిస్తే భారత్ భారీ స్కోరు చేసే అవకాశముంది.
India are off to a great start in the second Test against West Indies 👌
📝 #WIvIND: https://t.co/TTE3F8QIEE #WTC25 pic.twitter.com/sEiqAFfRN1
— ICC (@ICC) July 20, 2023