Telangana Tourism Hyderabad to Nasik Package | ఈ వేసవిలో సరికొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు పర్యాటకులు..! కొందరు సేద తీరే ప్రాంతాలను ఎంచుకుంటే… మరికొందరు అధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లాలని చూస్తారు. అయితే అధ్యాత్మిక పర్యటనలో భాగంగా నాసిక్ త్రయంబకేశ్వర్(Nashik Trimbakeshwar), షిరిడీ (Shiridi) వెళ్లే పర్యాటకుల కోసం సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది తెలంగాణ టూరిజం. ‘షిర్డీ నాసిక్ త్రయంబకేశ్వర్ టూర్’ (Shirdi Nasik Triambakeswar Tour ) పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోండగా.. బస్సు మార్గంలో (BUS Route) ఈ టూర్ను ఆపరేట్ చేస్తున్నారు.
‘షిర్డీ నాసిక్ త్రయంబకేశ్వర్ టూర్’ (Shirdi Nasik Triambakeswar Tour ) పేరుతో తెలంగాణ టూరిజం ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. ప్రతి శనివారం ఈ ప్యాకేజీ (Sai Shivam Tour Package) అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో నాసిక్ త్రయంబకేశ్వర్, షిరిడీ ఆలయం, పంచవటి (Panchavati) లాంటి అధ్యాత్మిక (Spiritual) ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 3 రాత్రులు, 4 రోజులు కొనసాగుతుంది.
‘షిర్డీ నాసిక్ త్రయంబకేశ్వర్ టూర్’ ప్రయాణం ఇలా..
Day 1: మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్లో (Hyderabad) టూర్ ప్రారంభం అవుతుంది. దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ నుండి మధ్యాహ్నం 03:00 గంటలకు బస్సు బయలుదేరుతుంది. బషీర్బాగ్లో సాయంత్రం 04:00 గంటలకు.. యాత్రి నివాస్, సర్దార్ పటేల్ రోడ్, ప్యారడైజ్ సర్కిల్ నుంచి సాయంత్రం 05:00 కు, పర్యాటక్ భవన్, బేగంపేట్ నుంచి సాయంత్రం 05:15 గంటలకు, కేపీహెచ్బీ VRK సిల్క్స్ నుంచి సాయంత్రం 06:15 గంటలకు, చందానగర్ నుంచి సాయంత్రం 06:30 గంటలకు బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ (Overnight Journey) ఉంటుంది.
Day 2: రెండో రోజు ఉదయం 7:00 గంటలకు షిరిడీ చేరుకుని.. హోటల్లో చెక్ ఇన్ అవ్వడం.. అనంతరం షిరిడీ ఆలయం దర్శనం (పర్యాటకుల స్వంత ఖర్చుతో) ఉంటుంది. భోజనం తర్వాత రాత్రి షిరిడీలోనే బస ఉంటుంది.
Day 3: మూడో రోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు షిరిడీ నుంచి నాసిక్లోని త్రయంబకేశ్వర్కు బయలుదేరుతారు. నాసిక్ జ్యోతిర్లింగం దర్శనం అనంతరం.. పంచవటి సందర్శన ఉంటుంది. తర్వాత హైదరాబాద్కు తిరిగి ప్రయాణం అవుతారు.
Day 4: తెల్లవారుజామున ఉదయం 06.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
హైదరాబాద్ టూ ‘షిర్డీ నాసిక్ త్రయంబకేశ్వర్ టూర్’ ప్యాకేజీ ధర
Hyderabad to Tour cost | నాన్ AC బస్ ప్యాకేజీలో పెద్దలకు రూ.3100, పిల్లలు (5 నుంచి 12సంవత్సరాలు) రూ.2530 చెల్లించాల్సి ఉంటుంది. ఇక టూర్ ప్యాకేజీలో బస్సు టికెట్లు, హోటల్లో వసతి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.
గమనిక: రవాణా, వసతి ప్యాకేజీలో చేర్చబడింది. ఆహారం, దర్శనం, ఇతర ఖర్చులు పర్యాటకులే భరించాలి
పూర్తి వివరాల కోసం.. telangana tourism క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://tourism.telangana.gov.in/package/shirdinasik