మొయినాబాద్, జనవరి 19: పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బిజియాదేవి (60) అనారోగ్యంతో మరణించారు. ఆమె దాదాపు 15 ఏండ్లపాటు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పశువైద్యాధికారిగా సేవలందించారు. తర్వాత చేవెళ్లకు అక్కడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా పశుసంవర్ధక శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. రిటైర్మెంట్ తరువాత అదే శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. వైద్యారోగ్య శాఖలో వైద్యుడిగా పనిచేసిన ఆమె భర్త అనారోగ్యంతో ఆరు నెలల క్రితం మరణించారు. అనారోగ్యంతో వారంరోజులుగా దవాఖానలో చేరిన ఆమె మంగళవారం రాత్రి మృతి చెందా రు. సంతానం లేకపోవడంతో బంధుమిత్రులు కలిసి లంగర్హౌస్ శ్మశాన వాటికలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు.