న్యూఢిల్లీ: రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2021 కోసం ఫ్రాంఛైజీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ ప్రారంభించగా త్వరలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా శిబిరాన్ని మొదలుపెట్టబోతోంది. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్-14వ సీజన్ ఆరంభంకానుండగా మార్చి 30 నుంచి ఆటగాళ్ల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.
‘పలువురు ఆటగాళ్లు అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ ఆడుతున్నారు. ఈ ఆటగాళ్లందరూ ఫ్రెష్గా ఉండేందుకు, తమ కుటుంబసభ్యులతో కొన్ని రోజులు గడపాలనే ఉద్దేశంతో ఆలస్యంగా క్యాంప్ను నిర్వహించాలని అనుకున్నాం. ఆటగాళ్లు బయో బబుల్లోకి ప్రవేశించే ముందు ఉత్సాహంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు’ ఢిల్లీ జట్టు సీఈవో వినోద్ బిష్త్ తెలిపారు.