సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీపీగా ఉన్న అంజనీకుమార్ను ఏసీబీ డీజీగా బదిలీ చేశారు. శుక్రవారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరితో పాటు మరికొందరు సీనియర్ ఐపీఎస్లకు స్థాన చలనం జరిగింది. అడిషనల్ సీపీ శిఖా గోయల్ ఏసీబీ డైరెక్టర్గా, వెస్ట్జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సిట్ ఆండ్ క్రైం జాయింట్ కమిషనర్గా, సీఐడీ డీఐజీ ఏవీ రంగనాథ్ ట్రాఫిక్ అదనపు కమిషనర్గా, నార్త్జోన్ డీసీపీ కల్మేశ్వర్ సైబరాబాద్ క్రైం డీసీపీగా, ఎస్బీ జాయింట్ కమిషనర్గా విశ్వ ప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ప్రకాశ్రెడ్డి, మాదాపూర్ డీసీపీగా శిల్పవల్లి,బాలానగర్ డీసీపీగా సుదీప్ గోనె, శంషాబాద్ డీసీపీగా జగదీశ్వర్ రెడ్డి, సైబరాబాద్ జాయింట్ కమిషనర్గా అవినాశ్ మహంతి, వెస్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిస్, కార్ జాయింట్ కమిషనర్గా కార్తికేయ, నార్త్జోన్ డీసీపీగా దీప్తి చందన, డీడీ డీసీపీగా గజరావు భూపాల్, సైబరాబాద్ క్రైం డీసీపీ రోహిణి ప్రియదర్శిని మెదక్ ఎస్పీగా బదిలీ అయ్యారు.