న్యూఢిల్లీ: పది, పన్నెండో తరగతుల ఫస్ట్ టర్మ్ బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ‘కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్’ (సీఐఎస్సీఈ) మంగళవారం వెల్లడించింది. తమ నియంత్రణలో లేని అనివార్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని, కొత్త షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్, సెక్రటరీ గెర్రీ అరతూన్ తెలిపారు.