అయిజ: కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. సోమ వారం డ్యాంలోకి ఇన్ఫ్లో 10,871 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 10,474 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎం సీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.23 9 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికి గాను, ప్రస్తుతం 1632.84 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు వరద..
కర్ణాటకలోని ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతోంది. సోమవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 12,233 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, 11,800 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకే సుల బ్యారేజీకి చేరుతోందని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 9.2 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 433 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.