ఆదిలాబాద్, జూలై 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పేద ల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటు చేసి ప్రజలకు పలు రకాల వైద్య సేవలు అందిస్తున్నది. రిమ్స్కు వచ్చే పేదలకు వైద్య సేవల్లో భాగంగా ఎంఆర్ఐ ద్వారా పలు రకాల పరీక్షలు చేయాల్సి వస్తున్నది. దవాఖానలో ఎంఆర్ఐ మిషన్ లేకపోవడం సమస్యగా మారింది.
దీంతో రిమ్స్కు ఎంఆర్ఐ యంత్రాన్ని మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావును కోరారు. రిమ్స్కు రూ.11.65 కోట్లతో ఎంఆర్ఐ మిషన్ మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. మిషన్ మంజూరుపై ఎమ్మెల్యే జోగు రామన్న హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయంతో పేద ప్రజలకు సర్కారు వైద్య సేవలు మరింత చేరువుతాయని ఆయన తెలిపారు. యంత్రాన్ని మంజూ రు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.