హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్చంద్రబోస్ జయంతి రోజైన జనవరి 23న జన్ఊర్జా మంచ్ ఆధ్వర్యంలో రవింద్రభారతిలో ‘ఉద్ఘోష్-2022’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఇండియన్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర గీత పనిదారుల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్గౌడ్, జన్ఊర్జా మంచ్ అధ్యక్షుడు డాక్టర్ మనీష్, కార్యదర్శి నిశితా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘కల్లు మా ట్రెడిషన్.. ఇది మందు కాదు మెడిసిన్’ అంటూ తెలంగాణ సంస్కృతిని అఖండ చిత్రంలో చాటిచెప్పిన దర్శకుడు బోయపాటి శ్రీనును మంగళవారం గౌడసంఘాలు సన్మానించాయి. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో నిర్మించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్, కార్య నిర్వాహక అధ్యక్షుడు భిక్షపతిగౌడ్, రాష్ట్ర నాయకుడు పులి శివకుమార్గౌడ్, గౌడ సంఘాల నాయకులు పాల్గొన్నారు.