PV Sindhu | కోట్లాది భారతీయులు పెట్టుకున్న ఆశలు నెరవేరాయి. నిన్న జరిగిన సెమీస్లో ఓడినప్పటికీ.. ఇవాళ కాంస్యం కోసం జరిగిన పోరులో పీవీ సింధు ధైర్యంగా పోరాడింది. టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics )లో భాగంగా ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్లో సింధు 21-13, 21-15 తేడాతో వరుస గేమ్స్లో విజయం సాధించింది. కాంస్య పతాకాన్నిగెలిచి చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారతీయ మహిళగా రికార్డుకెక్కింది.