లక్నో: కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లిన యాత్రికురాలిని ఒక యువకుడు వేధించాడు. చేతిలో బిడ్డ ఉన్న ఆమె వెంట పడి బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Woman Pilgrim Molested, Kissed By Youth) ఉత్తరప్రదేశ్లోని మధురలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక యువతి తన కుటుంబంతో కలిసి మధురకు వచ్చింది. అక్కడున్న ఆలయాలు సందర్శిస్తుండగా ఆ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఆ మహిళను వెంబడించాడు. చేతిలో బిడ్డతోపాటు మరో బాలుడితో కలిసి వెళ్తున్న ఆమె అతడి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఆ యువకుడు ఆమెను సమీపించి బలవంతంగా ముద్దుపెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన అనంతరం ఆ మహిళ తన కుటుంబంతో కలిసి బెంగాల్కు వెళ్లిపోయింది.
కాగా, ఈ విషయం తెలిసిన ఆ గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించారు. ఆ యువకుడ్ని నిలదీశారు. దీంతో తన తప్పుపై క్షమాపణలు కోరిన అతడు చెప్పుతో పదిసార్లు కొట్టుకున్నాడు. క్షమించిన గ్రామ పెద్దలు అతడ్ని వదిలేశారు.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో యాత్రికురాలి పట్ల యువకుడి అనుచిత ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. దీంతో ఈ సంఘటనపై పోలీసులు దృష్టిసారించారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదు. అయితే ఆ యువకుడు అదృశ్యమైనట్లు తెలుస్తున్నది.
A girl from #WestBengal came to #Mathura with her family to visit religious places. Where she was staying, a boy living in the neighbourhood kissed the girl in public.
The accused was caught after being identified through CCTV. A panchayat was called in an ashram. (1/2) pic.twitter.com/pACxK21gqU— Siraj Noorani (@sirajnoorani) April 13, 2024