న్యూయార్క్: కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకుంటున్న భారత్కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్నేహ హస్తాన్ని అందించింది. ఇండియాకు అదనంగా మరో 41 మిలియన్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని ఆ దేశం ప్రకటించింది. కోవిడ్ను ఎదుర్కొనేందుకు ఆ సాయాన్ని వినియోగించనున్నారు. ఇప్పటి వరకు అమెరికా 200 మిలియన్ల డాలర్ల విలువైన సహాయాన్ని అందించింది. గతంలో ఇండియాకు తమకు తోడుగా నిలిచిందని, ఇప్పుడు కష్ట సమయాల్లో ఉన్న ఆ దేశాన్ని తాము ఆదుకోబోతున్నట్లు అమెరికా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. కోవిడ్ టెస్టింగ్, మెంటల్ హెల్త్ సర్వీస్, మెడికల్ సర్వీస్కు ఆ నిధులను ఖర్చు చేయనున్నారు. అమెరికా ఏజెన్సీ సుమారు రెండు లక్షల మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు శిక్షణ ఇచ్చింది. మే నెలలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ వంద మిలియన్ డాలర్ల కోవిడ్ సహాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.