న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh)పై .. రాజ్యసభ వేటు వేసింది. వర్షాకాల సమావేశాలు పూర్తి అయ్యేవరకు ఆయనపై సస్పెన్షన్ విధించింది. ఇవాళ సభ ప్రారంభమైన తర్వాత ఎంపీ సంజయ్ సింగ్ .. వెల్లోకి దూసుకువెళ్లి రభస సృష్టించారు. మణిపూర్ అంశంపై చర్చించాలని పట్టుపట్టారు. చైర్మెన్ జగదీప్ ధన్కర్ ఆదేశించినా.. ఎంపీ సంజయ్ వెనక్కి వెళ్లలేదు. దీంతో చైర్మెన్ ఆగ్రహానికి గురయ్యారు. సంజయ్ను సస్పెండ్ చేస్తూ హౌజ్ లీడర్ పీయూష్ గోయల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చైర్మెన్ జగదీప్ ఆ తీర్మానానికి ఓకే చెప్పేశారు.
రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో.. ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ సమాధానం ఇచ్చారు. అయితే ఆ సమయంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. దీంతో చైర్మెన్ జగదీన్ సీరియస్ అయ్యారు. అయినా ఆప్ ఎంపీ వినిపించుకోలేదు. దీంతో ఆయన్ను ఈ సెషన్కు సస్పెండ్ చేశారు.
#WATCH | Rajya Sabha Chairman suspends AAP MP Sanjay Singh for the remaining duration of the Monsoon session during the Opposition's protest in the House over the Manipur issue pic.twitter.com/YpNYIhhMck
— ANI (@ANI) July 24, 2023