మణుగూరు, మార్చి 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలో 1080 (4×270) మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న బీటీపీఎస్ (భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం)లో శుక్రవారం అర్ధరాత్రి యూనిట్-3 సీవోడీ (కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్)విజయవంతంగా పూర్తయింది. యూనిట్ పరిధిలో ఉత్పత్తి చేసిన 271.8 మెగావాట్ల విద్యుత్ను రాష్ట్ర అనుసంధానం చేసినట్లు జెన్కో అధికారులు తెలిపారు. ఇందుకు అవసర మైన అగ్రిమెంట్ పత్రాలను టీఎస్ ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అధికారులు జెన్కో అధికారులకు అందజేశారు. జెన్కో అండ్ ట్రాన్స్కో సీఏండీ డి.ప్రభాకర్రావు ఆదేశాల మేరకు 1, 2, 3 యూనిట్లలో 810 మోగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నట్లు బీటీపీఎస్ అధికారులు తెలిపారు. ఇప్పటికే యూనిట్లు -1, 2 నుంచి రాష్ర్టానికి విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. త్వరలో యూనిట్-4ను కూడా సీవోడీకి సిద్ధం చేయనున్నట్లు జెన్కో డైరెక్టర్(ప్రాజెక్టు) ఎం.సచ్చితానందం తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ ఎన్పీడీసీఎల్(డైరెక్టర్) గణపతి, బీటీపీఎస్ సీఈ బాలరాజు, సీజీఎంలు మధుసూదన్, కృష్టయ్య, సీఈలు మూర్తి, శ్రీనివాపరావు, భెల్ జీఎం ఆగర్వాల్, వైఎం బాబు, కపూర్ పాల్గొన్నారు.
సీఎండీకి ‘రేగా’ కృతజ్ఞతలు
బీటీపీఎస్ యూనిట్-3లో సీవోడీని విజయవంతంగా పూర్తి చేసిన జెన్కో, భేల్ అధికారులకు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అభినందనలు, జెన్కో అండ్ ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు, డైరెక్టర్(సివిల్) అజయ్కు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఆయన ‘నమస్తే’తో మాట్లాడుతూ.. ఈ ప్రాంత అభివృద్ధిలో బీటీపీఎస్ పాత్ర కీలకమన్నారు. ప్లాంట్ పరిధిలో భూములు కోల్పోయిన 346 మంది నిర్వాసితులకు కచ్చితంగా ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుందన్నారు. శనివారం ప్రత్యేకంగా హైదరాబాద్లో జెన్కో సీఎండీని కలిసి నిర్వాసితుల గురించి చర్చించామన్నారు.